కరోనా విజృంభణ; 1,26,789 కొత్త కేసులు

8 Apr, 2021 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతూ ప్రజల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల్లో 1,26,789 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 685 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 59,258 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కి పెరిగింది. ఇప్పటి వరకు 1,18,51,393 మంది కోలుకొని డిశ్చార్జి అ‍య్యారు. ప్రస్తుతం 9,10,319 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 1,66,862 గా ఉంది. ఇప్పటి వరకు 9,01,98,673 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

చదవండి: కోవిడ్‌ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు! 

మరిన్ని వార్తలు