కరోనా తగ్గుముఖం: కొత్తగా 238 కేసులు

2 Jan, 2021 18:42 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 48,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కోవిడ్‌ వల్ల నిన్న ఒక్క రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,850కు చేరింది. మొత్తం 7111 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 279 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 8,72,545 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 3,194 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో1,19,32,603 శాంపిల్స్‌ను పరీక్షించారు. చదవండి: కొత్త కరోనా టెన్షన్‌: వారికి ఈ మార్గదర్శకాలు తప్పనిసరి

మరిన్ని వార్తలు