ఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు

11 Sep, 2020 18:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం నాటికి 44,52,128 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 9,999 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,47,686 కు చేరింది. కొత్తగా 77 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779  చేరింది. (సృష్టి ఆసుపత్రి కేసు:. డాక్టర్ నమ్రతకు నోటీసులు)

గురువారం 11,069 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 4,46,716 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 96, 191 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా నిన్న కడపలో 9, చిత్తూరులో 8, నెల్లూరులో 8, ప్రకాశంలో 8, కృష్ణాలో 7, గుంటూరులో 7, అనంతపూరంలో 6,  విశాఖలో 6, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 5,  తూర్పు గోదావరిలో 4, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 1 చొప్పున మరణించారు. (కరోనా టెస్టు చేయించుకున్న ఉప రాష్ట్రపతి)

మరిన్ని వార్తలు