ఏపీలో కొత్తగా 214 కరోనా కేసులు

21 Dec, 2020 19:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,295 కరోనా పరీక్షలు నిర్వహించగా, 214 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.  కోవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.  ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 422 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,13,01,105 శాంపిల్స్‌ను పరీక్షించారు. 

మరిన్ని వార్తలు