ఏపీలో చేసిన మొత్తం పరీక్షలు 24,24,393
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకుని శనివారం ఒకే రోజు 9,151 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,29,615కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు 62,123 మందికి పరీక్షలు నిర్వహించగా, 10,080 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,040కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్లో పేర్కొంది. మొత్తం పరీక్షలు 24,24,393కి చేరాయి. ప్రతి పది లక్షల జనాభాకు సగటున 45,401 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా 97 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 1,939కి చేరింది. యాక్టివ్ కేసులు 85,486 ఉన్నాయి.