ఏపీ : ఒక్కరోజే 2,784 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌

29 Jul, 2020 18:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం ఉ. 9 గంటల నుంచి బుధవారం ఉ.9  గంటల వరకు 70,584 పరీక్షలు చేయగా 10,093 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 65 మంది మృతిచెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,213గా నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 18,20,009 శాంపిల్స్‌ను పరీక్షించారు. (వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు)

జిల్లాల వారీగా కరోనా కేసులు

మరిన్ని వార్తలు