ఏపీ : ఒక్క రోజే 4,618 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌

30 Jul, 2020 18:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,90,077 శాంపిల్స్‌ను పరీక్షించారు.మరోవైపు గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 4,618 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 60,024కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,167 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 69,252 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 68 మంది మృతిచెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,281గా నమోదైంది. (అది సీఎం జ‌గ‌న్ ఆలోచ‌నే..)

జిల్లాల వారీగా కరోనా కేసులు:

మరిన్ని వార్తలు