7,594 మంది డిశ్చార్జ్‌

8 Aug, 2020 05:09 IST|Sakshi

ఏపీలో మొత్తం కోలుకున్నవారు 1,20,464 మంది

కొత్తగా 10,171 మందికి పాజిటివ్‌ 

సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,20,464కి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు మొత్తం 62,938 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షలు 23,62,270కి చేరాయి. కొత్తగా 10,171 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. తాజాగా 89 మంది మృతితో మొత్తం మరణాలు 1,842కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 84,654 ఉన్నాయి.

మరిన్ని వార్తలు