24 గంటల్లో 61,331 టెస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్క రోజులో 8,463 మంది కోవిడ్–19 వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 3,03,711 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 61,331 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 10,526 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గురువారం ఉదయం 9 గంటల నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 81 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 35,41,321 మందికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకిన వారి సంఖ్య 4,03,616కి చేరింది. ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులున్నాయి.