ఏపీలో కొత్తగా 1,392 కరోనా కేసులు

9 Nov, 2020 18:33 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,050నమూనాలు పరీక్షించగా 1,392పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,359 కు చేరింది. కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,802కి చేరింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,549మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 87,25,025మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,235యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు