సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 90,21,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 80,737 నమూనాలు పరీక్షించగా 1,593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,51,298కు చేరింది. కొత్తగా 10 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,847కి చేరింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,178 మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,262 యాక్టివ్ కేసులు ఉన్నాయి.