సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7,998 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 58,052 శాంపిల్స్ను పరీక్షించగా 7,998 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 5,428 మంది డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 37,555కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 34,272 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 61 మంది మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 884గా నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 14,93,879 శాంపిల్స్ పరీక్షించారు.(ఆరోగ్య ఆసరా కింద రూ. 5 వేలు సాయం)
జిల్లాల వారీగా కరోనా కేసులు :