ఏపీలో కొత్తగా 8,368 కేసులు

7 Sep, 2020 18:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,187 నమూనాలు పరీక్షించగా 8,368 పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,06,493 కు చేరింది. కొత్తగా 70 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,487కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 10,055 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 4, 04, 074 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 41,66,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97,932యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


 

మరిన్ని వార్తలు