కొత్తగా 9,652 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా నుంచి కోలుకుంటున్నవారు గణనీయంగా పెరుగుతున్నారు. మంగళవారం ఒక్కరోజు 9,211మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,18,311కి చేరింది. గడిచిన 24 గంటల్లో 56,090మందికి పరీక్షలు చేయగా 9,652మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు3,06,261కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులెటిన్లో పేర్కొంది. ఇక కరనా బారినపడి గడచిన 24 గంటల్లో 88 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2820కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,61,611 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 85,130 యాక్టివ్ కేసు ఉన్నాయి.
(చదవండి : 24 గంటల్లో భారత్లో 55,079 పాజిటివ్ కేసులు)