ఏపీలో ఒక్కరోజులోనే 7,075 మంది రికవరీ

30 Sep, 2020 18:33 IST|Sakshi

కొత్తగా 6133 కేసులు, 48 మంది మృతి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళుతోంది. గడిచిన 24 గంటల్లో 71,806 నమూనాలు పరీక్షించగా 6,133 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,93,484 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో కొత్తగా 48 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5828 కు చేరింది. ఒక్క రోజులోనే 7,075 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,29,211. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 58,445.

ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజా పరీక్షల్లో 35,254 ట్రూనాట్‌ పద్ధతిలో, 36,552 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని వెల్లడించింది. మొత్తం ఇప్పటివరకు 58,06,558 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.94 శాతంగా ఉందని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,08,737 మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని వెల్లడించింది.
(చదవండి: బాబు కుట్ర‌లు ప‌న్నుతున్నారు: ఆళ్ల నాని)

మరిన్ని వార్తలు