ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు

1 Oct, 2020 17:59 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో 71,577 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 6,751 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. 

గత 24 గంటల్లో 7,297 మంది కొత్తగా రికవరీ కాగా.. ఇప్పటివరకు 6,36,508 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. కరోనాతో కొత్తగా 41 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5869గా ఉంది. కాగా ఏపీలో ప్రస్తుతం 57,858 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 58,78,135 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు