-

ఏపీలో కొత్తగా 1,657 కరోనా కేసులు

14 Nov, 2020 19:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 79,823 నమూనాలు పరీక్షించగా 1,657 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,52,955కు చేరింది. కొత్తగా ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,854కి చేరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,155 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,757యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు