సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఏ మాత్రం తగ్గకుండా పాజిటివ్ వ్యక్తులను గుర్తించడంలో ముందంజ వేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 65,889 పరీక్షలు చేయగా 5,795 మందికి పాజిటివ్ తేలింది. 6,046 మంది కరోనా నుంచి కోలుకోగా, 33 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 62,16,240కి చేరాయి. ఇప్పటివరకూ 7,29,307 మందికి పాజిటివ్ సోకగా, 6,72,479 మంది కోలుకున్నారు. 50,776 మంది చికిత్స తీసుకుంటుండగా, 6,052 మంది కరోనా కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 1,16,409 మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.