TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ

17 Sep, 2021 11:51 IST|Sakshi

తిరుమల (చిత్తూరు): శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో  ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కాగా, కేంద్రం మరోసారి కరోనా హెచ్చరికలు జారీచేసిన క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చైర్మన్‌​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కొన్నిసాంకేతిక సమస్యల కారణంగా.. ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ ఆలస్యమైందని అన్నారు. వారంలోగా సమస్యను పరిష్కరించి భక్తులకు స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  

చదవండి: ‘తప్పుడు లెక్కలతో ప్రజలను బురిడీ కొట్టించలేరు’

>
మరిన్ని వార్తలు