సీఎం జగన్‌ను కలిసిన సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆదిత్యనాథ్‌ దాస్‌

1 Oct, 2021 13:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ సమీర్‌ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించగా, ఆదిత్యనాథ్‌ దాస్ ఈ రోజు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష)

మరిన్ని వార్తలు