ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ

3 May, 2021 13:40 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తూ సడలింపులు ఉంటాయి. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.

చదవండి: Andhra Pradesh: కరోనా టెస్టుల్లో రికార్డు  
ఒక్కరోజులో 11,411 మంది రికవరీ

మరిన్ని వార్తలు