ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..

29 Sep, 2020 16:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులో ఉండే రైళ్ల సర్వీసులు, రైళ్లు నిలిచే స్టేషన్లను ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా  రైలు ప్రయాణాలకు భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ (డైలీ) - పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట
సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్(డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి
(తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)-రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి
(హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు,అనపర్తి,సామర్లకోట, పిఠాపురం,అన్నవరం,తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి,దువ్వాడ

ఇతర జోన్లలో ప్రత్యేక రైళ్లు..
జైపూర్- మైసూర్ (సోమ-బుధ) - కర్నూల్ సిటీ,డోన్,ధర్మవరం
మైసూర్-జైపూర్(గురు-శని)- ధర్మవరం,డోన్,కర్నూల్ సిటీ..
గోరకపూర్ యశ్వంత్ పూర్(సోమ-శని)- ధర్మవరం
యశ్వంత్ పూర్ గోరకపూర్(సోమ-గురు) ధర్మవరం..
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- చప్రా(సోమ-శని)-  గూడూరు 
చప్రా-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (సోమ-బుధ)- గూడూరు..
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ డైలీ- గూడూరు,చీరాల,తెనాలి,
న్యూ ఢిల్లీ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డైలీ- తెనాలి,చీరాల గూడూరు

మరిన్ని వార్తలు