కర్రల సమరంలో హింస.. 100మందికిపైగా గాయాలు

16 Oct, 2021 06:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు: దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి విగ్రహాల కోసం భక్తులు పెద్దఎత్తున పోటీ పడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. 9 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. 

చదవండి: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు