వారి కుట్రలను భగ్నం చేయండి : డీజీపీ

19 Jan, 2021 19:02 IST|Sakshi

అమరావతి : దేవాలయాలపై దాడులు, కేసుల ఛేదన, అరెస్టులు వంటి అంశాలపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి కుట్రలు భగ్నం చేయాలన, ఇందుకు ఏపీ డీజీపీ విలేజ్ కమిటీల సేవలను వినియోగించుకుని మందుకు సాగాలని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణకు ప్రజల సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్దేశాలు బయట పడుతున్నాయని, దానిపై ప్రత్యేక దృష్టిపెట్టి తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదలొద్దని తెలిపారు. ఆధారాలతో సహా నిందితులను  పట్టుకోవాలని, దాడులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు