YSR Pension Kanuka: ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

1 Nov, 2021 08:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 2.66 లక్షల మంది వాలంటీర్లు సోమవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ఈ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 1417.53 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల వరకు 46.69 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది.
(చదవండి: నీతి ఆయోగ్‌ నివేదిక: మిడిల్‌ క్లాస్‌కూ ఏపీలో ఆరోగ్య భద్రత)

మరిన్ని వార్తలు