కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ

28 Apr, 2022 12:23 IST|Sakshi

కాశీబుగ్గ:  మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. 
 

మరిన్ని వార్తలు