AP: నాడు–నేడుకు దేవి సీ ఫుడ్స్, అవంతి గ్రూప్‌ విరాళం 

10 May, 2022 10:22 IST|Sakshi
విరాళం డీడీలను సీఎంకు అందిస్తున్న దేవి సీ ఫుడ్స్, అవంతి గ్రూప్‌ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్‌ టు ఆంధ్రకు, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి దేవి సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం, అవంతి గ్రూప్‌ రూ.2 కోట్ల విరాళం అందించాయి. విరాళానికి సంబంధించిన డీడీలను సోమవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి దేవి సీ ఫుడ్స్‌ ఎండీ పోట్రు బ్రహా్మనందం, అవంతి గ్రూప్‌ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌ అందజేశారు.
చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా?   

మరిన్ని వార్తలు