రైతుల ముసుగులో టీడీపీ నేతలు.. ముగింపు సభలో ఏరులైన మద్యం

17 Dec, 2021 18:15 IST|Sakshi

సాక్షి, తిరుపతి: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభలో మద్యం ఏరులైపారింది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. అయితే ఒక పక్క పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంటే.. మరో పక్క కొందరు మద్యం సేవిస్తూ ఫుల్‌ బిజీగా మీడియాకు చిక్కారు. ఈ సభ రైతులది అని చెప్పుకుంటున్నా వెనకుండి నడిపిస్తున్నది టీడీపీయే అన్న సంగతి తెలిసిందే. ఈ సభకు టీడీపీ నాయకులు డబ్బులిచ్చి అమరావతి రైతుల ముసుగులో వివిధ జిల్లాల నుంచి ప్రజల్ని తరలించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు