ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్‌ తప్పనిసరి 

11 May, 2021 09:59 IST|Sakshi

అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి పొందండి

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 

సాక్షి, అమరావతి: కర్ఫ్యూ సమయంలో అంతర్‌రాష్ట్ర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిటిజన్‌ సర్వీసు పోర్టర్‌లో appolice.gov.in, twitter@appolice100, facebook@andhrapradeshstatepolice ద్వారా ఈ పాస్‌ పొందవచ్చని వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద నుంచి సరైన గుర్తింపుపత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చదవండి: అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి
Ongole: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌.. మెనూ అదుర్స్‌

మరిన్ని వార్తలు