సుప్రీంకోర్టు నోటీసుల విషయం మా దృష్టికి రాలేదు

17 Jun, 2021 13:46 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, తాడేపల్లి : టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల తేదీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఎటువంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొదటి నుంచి తమ స్టాండ్ ఒక్కటేనని, ఒక వేళ నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు