ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయశాఖ నోటీసులు

20 Aug, 2021 07:08 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్రకు శుక్రవారం దేవాదాయశాఖ నోటీసులు అందించింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ స్మారక ట్రస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు ట్రస్ట్‌ వార్షిక ఆదాయ వివరాలు అందించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2018 నుంచి జమా ఖర్చుల వివరాలను అందించాలని నోటీసులో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు