గుళ్లలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం

22 Dec, 2022 06:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్టీల్‌ప్లేట్‌లో పెట్టేచోట కూడా ప్లేట్‌లో ఆకువేసి వడ్డింపు

ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు  

సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవ­దా­యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధ­వా­రం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవ­­దాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌­లాల్‌ ఆ­దేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దే­వదా­య­శాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆ­లయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్ర­మా­లు కొనసా­గుతున్నాయి.

మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ  2,24,727 మంది భక్తు­లకు అన్నదానం జరిగింది. కొన్ని ఆల­యాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్య­క్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడిం­చారు.

ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్న­దా­నం పేరుతో అందజేసే ఆహారానికి మ­రిం­త పవిత్రతను కల్పించేందుకు భక్తు­లకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మా­త్ర­మే భో­జనం వడ్డించాలని నిర్ణయించి­నట్టు దేవ­దా­యశాఖ కమిషనర్‌ ఈవోలకు ఇచ్చిన ఆ­దేశాల్లో పేర్కొన్నారు.

ఒకవేళ స్టీల్‌ప్లేట్‌­లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్‌లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబం­ధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయ­శా­­ఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విష­యా­న్ని కమిషనర్‌ తన ఆదేశాల్లో ఉదహరించారు.   

మరిన్ని వార్తలు