టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

17 Jun, 2022 09:25 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. స్క్రాప్‌ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్‌తో జేసీ ట్రావెల్స్‌ నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది. సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. జేసీ ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.

చదవండి: (కర్నాటకలో ఏసీబీ అధికారుల సంచలనం)

మరిన్ని వార్తలు