కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి

3 Oct, 2021 04:35 IST|Sakshi
పోర్టులో లంగరు వేసిన నౌకలోకి బియ్యం బస్తాలు చేరవేస్తున్న దృశ్యం

ముత్తుకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ‘ఎంవీ సారోస్‌ బీ’ అనే నౌక ద్వారా 10,900 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శనివారం చెప్పారు. ఈ మేరకు పోర్టులోని గిడ్డంగిలో సిద్ధం చేసిన బియ్యం బస్తాలను లారీల ద్వారా నౌకలోకి చేరవేస్తున్నారు.

ఈ బియ్యం బస్తాలను ఈస్ట్‌ ఆఫ్రికా దేశంలోని మెడగాస్కర్‌ పోర్టుకు చేరవేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంకాలం బియ్యం ఎగుమతికి మరో నౌక పోర్టులో లంగరు వేసింది. అందులో 13వేల టన్నుల బియ్యంను వెస్ట్‌ ఆఫ్రికాలోని బెనిన్‌ పోర్టుకు చేరవేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు