సీఎం జగన్‌ పుట్టినరోజు నుంచి ఏపీలోనూ ‘ఫీడ్‌ ది నీడ్‌’ 

4 Dec, 2021 14:57 IST|Sakshi

యాపిల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నీలిమా ఆర్య 

సాక్షి, హైదరాబాద్‌: అన్నార్తులకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన ‘ఫీడ్‌ ది నీడ్‌’ కార్యక్రమాన్ని ఏపీలోనూ ప్రారంభించనున్నట్లు యాపిల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నీలిమాఆర్య తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని  21న విశాఖ, తిరుపతిలో రిఫ్రిజిరేటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  

యాపిల్‌ హోమ్‌ రియల్‌ నీడ్‌ ఇండియా ఫౌండేషన్, మ్యాచ్‌ పాయింట్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, యాపిల్‌ టీమ్‌ టెనీషియస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హోటెల్‌ తాజ్‌ దక్కన్‌లో మిక్స్‌ అండ్‌ మింగిల్‌–కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం నిర్వహించారు.  నీలిమా ఆర్య మాట్లాడుతూ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 350 రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు  చేయనున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు