సాక్షి, విజయవాడ: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ను లాడ్జిగా మార్చి 50 మంది కరోనా పేషెంట్లకు ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స అందిస్తోంది. కాగా, ఆదివారం తెల్లవారజామున అగ్నిప్రమాదం జరడగంతో హోటల్ సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించినట్లు సమాచారం. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.