హౌరా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. కుప్పం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల పరుగులు

27 Nov, 2022 13:56 IST|Sakshi

సాక్షి, చితూర్తు జిల్లా: బెంగళూరు నుంచి కుప్పం మీదగా యశ్వంత్‌పూర్‌ వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్‌9 బోగీలో మంటలు వ్యాపించాయి. దీంతో కుప్పం రైల్వేస్టేషన్‌లో రైలు నిలిచిపోయింది.

రైలు దిగిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది.. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి  పీల్చుకున్నారు.
చదవండి: ఎవరు హోల్డ్‌? ఎవరు ఓపెన్‌?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట..  

మరిన్ని వార్తలు