Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు

8 Oct, 2022 10:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటెల్‌ ఏర్పాటు, వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్‌ యూనివర్శిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్‌ జేఏసీ కన్వినర్‌గా నియమితులయ్యారు. జేఏసీలో సభ్యులుగా ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అక్టోబర్‌ 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు