-

200 కోట్లతో తిరుమలలో అధునాతన కర్ణాటక సత్రం

24 Sep, 2020 09:33 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. దాదాపు 200కోట్ల రూపాయలతో ఓ అధునాతన కర్ణాటక సత్రం రూపుదిద్దుకోనుంది. 7 ఎకరాల్లో ఐదు కాంప్లెక్స్‌లు, రోజుకు 1800 మంది భక్తులకు వసతి కల్పించేలా వాటి నిర్మాణం జరగనుంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన నిధులతో టీటీడీ ఈ భవనాలను నిర్మించనుంది. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు)

కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో లోక కళ్యాణార్ధం టీటీడీ  గత మార్చి నెలనుంచి నిర్వహిస్తోన్న ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. 


 


 

మరిన్ని వార్తలు