AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

16 Nov, 2022 07:13 IST|Sakshi

సాక్షి, కాకినాడ: గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్‌ వాహనం ఢీకొట్టింది. 

కాగా, ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. దీంతో, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ప్రమాదం తాడేపల్లిగూడెం నుండి వైజాగ్ వెళ్తుండగా జరిగింది.

మరిన్ని వార్తలు