గడప గడపన ఘన స్వాగతం

26 May, 2022 05:19 IST|Sakshi
ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో మహిళతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం 15వ రోజు బుధవారం ఉత్సాహంగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు.

సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేళ్లను వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి తెలిపారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు