సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా, వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.
సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. జగన్కు తమ ఆశీస్సులు ఉంటాయని తెలిపారు.