సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన జారీ చేసింది.