Anantapur Crime: గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతి

28 May, 2022 07:12 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో  గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లు కుప‍్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. 

>
మరిన్ని వార్తలు