ఏపీలో టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ

12 Oct, 2020 19:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా టీచర్ల బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. వెబ్‌కౌన్సిల్ ఆప్షన్ల ఆధారంగా బదిలీల ప్రక్రియ జరుగనుంది. టీచర్ల బదిలీల ఉత్తర్వుల పట్ల పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులు గత మూడేళ్లుగా బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు.
(చదవండి: మా నాన్న మృతిపై రాజకీయాలు చేస్తావా?)

>
మరిన్ని వార్తలు