ఏపీ ప్రజలకు గవర్నర్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

26 Jan, 2021 07:31 IST|Sakshi

సాక్షి, రాజ్‌భవన్‌: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ శాంతి, అహింసలకు కట్టుబడి సోదర భావంతో మెలగాలని తెలిపారు. ప్రతి వ్యక్తీ దేశ నిర్మాణానికి కృషి చేయాలని గవర్నర్‌ పేర్కొన్నారు.
చదవండి: ప్రజలకు సీఎం జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు