ఏపీలో 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ ఆమోదం

14 Jun, 2021 19:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్‌రాజు పదవులు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు