నేడు జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం

22 Jun, 2022 05:32 IST|Sakshi
కౌరూ అంతరిక్ష కేంద్రంలో జీశాట్‌–24 ఉపగ్రహంతో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్‌

ఫ్రాన్స్‌లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్షం కేంద్ర నుంచి

సూళ్లూరుపేట: న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌సీఐఎల్‌), కేంద ప్రభుత్వం తరఫున డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ (డీవోఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–వీ వీఏ257 రాకెట్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.

బెంగళూరులోని ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు స్పేస్‌ సెంటర్‌ (యూఆర్‌ఎస్‌సీ)లో రూపొందించిన 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్‌కు పంపించిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చారు. డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు.

న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ జీశాట్‌–24 ఉపగ్రహాన్ని టాటాప్లే అనే సంస్థకు లీజుకిచ్చింది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌కు చేరుకుని రాకెట్‌ ప్రయోగం పనులను పరిశీలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 4,000 కిలోలకుపైన బరువున్న భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తుండగా.. ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహాలను వారు మన దేశం అంటే ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నారు.  

మరిన్ని వార్తలు