Gudivada: టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..

18 Mar, 2023 08:50 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల పేరుతో గుడివాడలో టీడీపీ నేతలు గురువారం ఓవరాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చవద్దన్న పోలీసులను టీడీపీ నేతలు దూషించారు. తమ విధులకు ఆటకం కలిగించడం , అసభ్య పదజాలంతో మాట్లాడారని ఎస్సై గౌతమ్ కుమార్ వారిపై ఫిర్యాదు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 341, 285, 290, 506, R/w 34 కింద వన్‌టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు