అది రైతు పాదయాత్ర కాదు శ్రీమంతుల యాత్ర: గుమ్మనూరు జయరాం

13 Nov, 2021 17:00 IST|Sakshi

సాక్షి, కర్నూలు: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అవుతుందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. 'రైతు పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత అన్నీ చంద్రబాబే. ఆయన చేయిస్తున్న పాదయాత్ర.. న్యాయస్థానం టూ దేవస్థానం కాదు 'అన్యాయం టూ అన్యాయం మోసం టూ మోసం' అని టైటిల్‌ పెడితే బాగుంటుంది. పాదయాత్రకు ఆదరణ కరువయ్యింది. అది రైతు పాదయాత్ర కాదు శ్రీమంతుల యాత్ర. పాదయాత్ర వల్ల ప్రజలకు ఏమీ ఒరగదు. ప్రజలకు న్యాయం చేయాలంటే సీఎం జగన్‌కే సాధ్యం. రాయలసీమ అంటే చంద్రబాబుకు కక్ష. న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు న్యాయం చేస్తుంటే చంద్రబాబుకు ఓర్చుకోలేకపోతున్నాడని' మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. 

చదవండి: (త్వరలో టీడీపీ కనుమరుగు: అంబటి రాంబాబు)

మరిన్ని వార్తలు